సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణం లో గురువారం మన జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ మన భారత దేశ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుడు శాంతి అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమం నడిపించి ఈ ప్రపంచానికి ఒక కొత్త ఉద్యమాన్ని పరిచయం చేసిన గొప్ప ఉద్యమకారులు మహాత్మా గాంధీ అహింసా పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. అందుకే గాంధీజీ జన్మదినం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగాజరుపుకుంటారు. గాంధీజీ జీవితం, పనితీరును తెలుసుకొని, అతని సందేశాలను పాటించాల్సిన బాధ్యత మనందరిది.అలాగే భావితరాలకు వారి విలువలను, ఆశయాలను బోధించాలి అని అన్నారు ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహానేత గాంధీ ఇలాంటి మహనీయుడు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పల సైదులు వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి వివిధ నాయకులు పాల్గొన్నారు..
-----------------------
Admin