సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో "తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు" ఏర్పాటు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ బోర్డు అంశాన్ని వారి మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ (అమరుల ప్రాంగణం) వద్ద స్థానిక TUF (తెలంగాణ ఉద్యమకారుల ఫోరం) ఆధ్వర్యంలో "తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవ శాంతిదీక్ష" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది, తెలంగాణ JAC నాయకులు GVK మనోహర్,మల్లెల రామనాధం తదితరులు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీల వారు మద్దతు తెలిపారు.మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ ప్రచరకమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,నాగసీతారాములు,వూకంటి గోపాలరావు,ఆళ్ళ మురళి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగా కిరణ్,TV చౌదరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు,CPI జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, తెలంగాణ అమరవీరుల దినోత్సవ సంస్మరణ దినోత్సవ సాధన కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్,BSP మల్లికార్జున్,జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వేముల కార్తీక్, సాదిక్, టీవీపీఎస్ సతీష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో TUF జిల్లా కన్వీనర్ మంజూర్ అలీ, గూడెల్లి యాకయ్య, తెలంగాణ క్రాంతి,బొల్లం భాస్కర్,కొండా జంపన్న, విక్టోరియా,కనకలక్ష్మీ,నిర్మల,సమీర, ఇజ్జగాని రవి గౌడ్, శనగా రాంచందర్,బుడగం నాగేశ్వరరావు,మౌలానా సాహెబ్,అలీమొద్దీన్,ఏలియా, ప్రశాంత్,మురళి, మౌలాలి,సురేష్ నాయక్,రాజేష్,ఆదిల్,జీనీ, అఖిల్,రవీందర్,వెంకన్న, కొండపల్లి సీతారామయ్య, చంద్రశేఖర్,కేశుపాక ముత్తయ్య, నాగరాజు,ఐలయ్య, ఉద్యమకారులు, మేదావులు, ప్రజాసంఘాల నేతలు, అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.
-----------------------
Admin