సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో 25 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సులువ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు వార్డు ఇన్చార్జిలుగా పని చేసినటువంటి బండ్ల అన్నపూర్ణ , మెరిగ.ముత్యాలు, తెల్లబోయిన హేమలత లను శాలువా లతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారెంటీ పథకాల కొరకు అర్హులైన ప్రజలందరూ దగ్గర దరఖాస్తు స్వీకరించిందని, దరఖాస్తు చేసుకున్నవారికి రాజకీయాలకతీతంగా పథకాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర వచ్చి ఆరు గ్యారెంటీ అమలు పథకాల అమలుకు అభయహస్తం "ప్రజా పాలన "ద్వారా గృహ జ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు,చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, అనంతరం నిజమైన లబ్ది దారులకు పథకాలు అందుతాయని ఆయన అన్నారు..ప్రజలు దరఖాస్తుదారుల తేదీ పూర్తి అయ్యింది అని భయపడాల్సిన అవసరం లేదు అని, ఇది నిరంతర ప్రక్రియని గడువు ముగిసిన తర్వాత అయినా రెవిన్యూ కార్యాలయాలలో, తహసిల్దార్ ఆఫీస్ లలో దరఖాస్తులు చేసుకోవచ్చని అని అన్నారు.. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నలమద ఉమ ,సరిత లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శివశంకర్ దగ్గుపాటి రమేష్, కలం సంపత్ ,ఓర్సు వెంకన్న తోట ఉపేందర్, షేక్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin