సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకేచోట చదువుకున్నారు. కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లింగరెడ్డిగూడా ఉన్నత పాఠశాలలో 1991–92 ఏడవ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం లింగరెడ్డిగూడా గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు సాయన్న, రాజ్యలక్ష్మి, తిప్పన్నా, మల్లేష్, లక్ష్మయ్య, వారికి శాలువతో ఘనంగా సన్మానించారు 27మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొంది. ఇక నుంచి టచ్లో ఉండాలంటూ ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భీష్మ రవీందర్, శ్రీపాల్ రెడ్డి, పకీర్ పాషా, గణేష్, సురేందర్ రెడ్డి, శ్యామ్, ఎస్.రవి, సుధాకర్, శ్రీరాములు, జగన్ రెడ్డి, శంకర్, బి.మల్లేష్, జి.బాల్రాజ్, ఎం.యాదయ్య, లక్ష్మీకాంత్ రెడ్డి, ఎం శేఖర్, వెంకటేష్, కే. నర్సింలు, బి.నర్సింలు, సరళత, సునీత, మల్లేశ్వరి, పుష్పలత, సత్యమ్మ, కవిత. తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin