సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని అల్ట్రా విజన్ ఆస్పత్రి డాక్టర్ బొగ్గు సురేశ్ అన్నారు. గురువారం సాయంత్రం సత్యమ్మ గుడి సర్కిల్లో అల్ట్రా విజన్ ఆస్పత్రి భవనంలో కొత్తగా అల్ట్రా జనరల్ క్లినిక్ ప్రారంభించారు.... ఈ సందర్భంగా డాక్టర్ బొగ్గు సురేశ్ మాట్లాడుతూ దుద్దుకుంట ఫౌండేషన్ సహకారంతో అల్ట్రా విజన్ ఆస్పత్రిలో ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కొత్తగా ప్రారంభించిన అల్ట్రా జనరల్ క్లినిక్ సాయంత్రం 5 గంటల నుంచి నిపుణుడు డాక్టర్ అశ్వర్థకుమార్ అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుడా చైర్ పర్సన్ లక్ష్మి నరసమ్మ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, కౌన్సిలర్లు చెరువు భాస్కర్రెడ్డి, సూర్యగౌడచ, సీఏఓ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.
-----------------------
Admin