సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని పెదవీడు గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో "చిట్యాల ఐలమ్మ" 128వ జయంతిని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బీబీ కుతుబ్ ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి సైదులు మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దేశ్ ముఖ్ లకు,దొరలకు, రజాకార్లకు ఎదురొడ్డి నిలిచి అలుపెరుగని పోరాటం చేసిన వీర ధీర వనిత "చాకలి ఐలమ్మ" అని కొనియాడుతూ ప్రపంచపటంలో పోరాటాలు చూస్తే గనుక ఐలమ్మ చేపట్టిన ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాఠ్యపుస్తకాలకే పరిమితమైన "చాకలి ఐలమ్మ చరిత్ర" తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచి, ఆమె ఉద్యమ స్ఫూర్తికి చిహ్నంగా "జనగామ జిల్లాకు ఆమె పేరు" పెట్టాలని, ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ , చిలక సతీష్ ,సాముల వెంకటేశ్వర రెడ్డి, పేరం బ్రహ్మం, నల్లగంతుల సోమశేఖర్, గురవయ్య, వెంకటయ్య, వీరనాగులు.,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin