సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం గోదావరి వరద ముంపు బాధితులపై ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. 150 రోజులుగా 300 మంది వరద బాధితులు శాంతి యుతంగా నిరవధిక నిరసన దీక్షను చేపడుతున్నారు. అటవీ సిబ్బందికి నిరసనకారులకు మధ్య ఎలాంటి వివాదం లేదు. రోడ్డు ప్రక్కన అర్ అండ్ బీ ప్రభుత్వ స్థలంలో 300 మంది ఆదివాసీలు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక నిరసన దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్ష శిబిరాన్ని మంగళవారం అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు.నివాస స్థలం చూపించమని తహసిల్దార్, కలెక్టర్ సంప్రదింపులు జరుపుతున్నామని, గోదావరి ముంపు బాధితులతో పాటు నిరుపేద ఆదివాసి, దళితులకు కూడా గృహ వసతి కల్పించమని కోరుతున్నామని గోదావరి వరద ముంపు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షులు ఎట్టి లక్ష్మణ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం, మణుగూరు సబ్ డివిజన్ కమిటీ సభ్యురాలు పెద్దని ఆదిలక్ష్మి అన్నారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25వేల కుటుంబాలు గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతుతో నిరుపేదలు పోరాట కమిటీని ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా పోరాడుతున్నారన్నారు....
-----------------------
Admin