సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాఏప్రిల్ 5న చలో ఢిల్లీ కా కార్యక్రమం జయప్రదo చేయండి.సీఐటీయూపిలుపునిచ్చింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. కనీస పింఛన్ పదివేలు రూపాయలు ఇవ్వాలి. లేబర్ కోట్లను రద్దు చేయాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు, డైలీ వేస్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. సిపిఎస్ రద్దు చేయాలి. రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి. కేరళ తరహాలో రైతులకు రుణమాఫీ చేయాలి. విద్యుత్ సవరణ బిల్లు 2022రద్దు చేయాలి. ఎరువుల సబ్సిడీని పెంచాలి. ఉపాధిహమి చట్టానికి బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెంచాలి. ఉపాధి కూలీలకు ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించాలి. రోజుకు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. కౌలు రైతు లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బ్యాంకు, రుణాలు ఇవ్వాలి నష్టపరిహారాలు చెల్లించాలి. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయప్ప,సీఐటీయూ నాయకులు రమణ ,శ్రీరాములు , రైతు సంగంనాయకులు రామిరెడ్డి, అంగన్వాడీ కార్యకర్త ఆశీర్వాదమ్మ, ఆశా వర్కర్స్ బసీరా,తార, మంజుల. మధ్యాహ్న భోజనం వంట కార్మికుడు రాఘవయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్, నాగమ్మ.తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin