సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలంలో పలు ప్రాంతలలో ఎఐఎఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల ప్రచారాన్ని ఆశిషజానవాహిని తో రేవూరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు సింహం గుర్తుకు వేసి రఘును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. జోరు వానలో కూడా ఆగని ప్రచారం తో,ఉత్తేజ నిండిన ఉత్సాహంతో సింహం గుర్తుపై ఎమ్మెల్యే గెలుపుని ఎవరు ఆపలేరని రేవురు ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ నియోజకవర్గ మండలాలు తనవైపే, మండలాల్లో పల్లెలన్ని తనవైపే ఉన్నాయని తన లాంటి ప్రజాసేవకుడే ఎమ్మెల్యేగా కావాలని నియోజకవర్గ మొత్తం కోరుకుంటుందని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అన్నారు.రైతులను కరెంటు, సాగునీటి కష్టాలు లేకుండా చూసుకుంటానని, ఊరిలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపిస్తానని, అన్ని కులాల మతాల పండగలకు ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు దీటుగా మేనిఫెస్టో ఉంచానని విద్యా వైద్య ఆర్థికంగా, నిరుద్యోగులు కు కోచింగ్లు ఇప్పిస్తూ,ప్రతి గ్రామంలో ఉన్న పేదలకు సొంతంగా 10 ఇండ్లను నిర్మిస్తానని, పండగలను ప్రజలందరూ కలిసి చేసుకునేలా తన మార్కు ఉంటుందని,అన్నదానాలకు ఆర్థిక సాయం అందిస్తానని.. నూతన దేవాలయాలకు పాఠశాలలకు సాయం అందిస్తామన్నారు.. మొన్న వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలలో ముగ్గురు యస్ఐ లు, 40 మంది కానిస్టేబుల్ గా ఎంపికైనరు అన్నారు. రాబోయేది రఘున్న రాజ్యమని ప్రజలే పాలకులు అని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ఓట్లను దుర్వినియోగం చేసి, అవినీతికి అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పేదవాళ్ల ఇళ్లను కూల్చి వారు మాత్రం ఇంద్రభవనం లాంటి ఇళ్లలో సకల సౌకర్యాలు పొందుతున్నారని అన్నారు. సీనియర్ నాయకుడు 800 ఎకరాలు కబ్జాలు చేశారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. మెళ్లచెరువు మండల ప్రాంతం సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉండడం వలన తాను ఎమ్మెల్యేగా గెలిచాక స్థానిక యువతకు ఫ్యాక్టరీలు ఉద్యోగాలపరంగా ప్రాధాన్యత ఇస్తానన్నారు. రైతులు పత్తి మిరపలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తనదే అన్నాడు. అకాల వర్షం చేత ఎవరైనా రైతులు నష్టపోతే వెంటనే సహాయాలు అందిస్తామన్నారు. పెళ్లి కానుకలు, దశదిన కర్మలకు ఆర్థికచేయుతలు అందిస్తామన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నియోజవర్గ వ్యాప్తంగా నిర్వహించామన్నారు. తన ప్రజా ఆదరణను చూసి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు గుండెల్లో భయం పట్టుకుందని అన్నారు. తన గెలుపును తట్టుకోవడానికి పార్టీలు నాయకులను కొనుక్కునే ప్రయత్నాలు, పార్టీల కండువాలు కప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీలన్నీ కుమ్మక్కైన సింగిల్ గా సింహం గుర్తుతో ఎమ్మెల్యే గెలుపును ఎవరు ఆపలేరు అన్నారు.ఏదేమైనా అందరి దేవుళ్ళ దీవెనలతో, ప్రజల ఆదరాభిమానాలతో తన ఎమ్మెల్యే గెలుపు ఖాయమని,ప్రజలు కూడా మంచి ఎదో చెడేదో ఆలోచించి మంచి వైపు నిలబడే నిర్ణయం తీసుకోని సింహం గుర్తుకే ఓటేసి తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. తన గెలుపు ప్రజా గెలుపుగా హుజూర్నగర్ నియోజకవర్గం చరిత్ర సృష్టిస్తుందని పిల్లుట్ల రఘు అన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు, ఎఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు,రఘున్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin