సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / షాద్ నగర్ నియోజకవర్గం , కొత్తూరు మండల పరిధిలోని తాళ్లగూడ, మల్లాపూర్, మల్లాపూర్ తండా, గూడూర్ ముక్తగూడ గ్రామాలలో మంగళవారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి ఆధ్వర్యంలో, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గ్రామంలో రానున్న నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని. ప్రతి గ్రామంలోని వయోజనులు అలాగే అవసరం ఉన్న ప్రతి వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన ఈరోజు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న 950 మందికి చికిత్స అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, విజయభాస్కర్, శ్యాంసుందర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, కృష్ణా రెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్, శివలింగం, రమేష్, రాఘవేందర్, రఘు, వరుణ్ గౌడ్, జైపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విక్రం రెడ్డి, మధు, గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అంజి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీను, సతీష్ గౌడ్, శేఖర్, మంగళి ప్రశాంత్, ఆంజనేయులు, పసుల శ్రీశైలం, గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin