సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పోచమ్మ తల్లి దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల సాయిబాబా కాలనీలో 6వార్డ్ కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గౌడ్, మరియు కాలనీవాసుల ఆహ్వాన మేరకు పోచమ్మ తల్లి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల పండుగలు ఆయన తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయిబాబా కాలనీవాసులు సమైక్యంగా ఎంతో కష్టపడి ఆలయాలను నిర్మించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజులు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గౌడ్ లను ప్రత్యేకంగా అభినందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వెంకన్న బాబు, కార్మిక నేత పినపాక ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నేత అందే మోహన్, అమర్నాథ్ రెడ్డి, శివ, మంగ శంకర్, కిరణ్, తుపాకుల శేఖర్, ముబారక్, సీతారాం, లింగారెడ్డి గూడా అశోక్, గంగ ముని సత్తయ్య, శ్రీధర్, మున్నా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin