సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : రైతు బాంధవుడైన వైయస్సార్ జయంతి వేడుకల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షులు కామిశెట్టి రవికుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైస్ షర్మిలమ్మ ఆదేశాల మేరకు పాలేరు నియోజకవర్గంలో కర్ణగిరి లో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా నాయకునికి మరణం లేదని తెలుగు ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన మహా నాయకుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీ పీ మఠంపల్లి మండల అధ్యక్షులు బలుసుపాటి రవి చింతలపాలెం వైయస్సార్టిపీ మండల అధ్యక్షులు షేక్ నాగులుమీరా వైయస్సార్టీపీ నేరేడుచర్ల మండల అధ్యక్షులు తురక శ్రీను వైయస్సార్టీపీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కుక్కడపు ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin