సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజవర్గం వారికి హైమద్గూడ లో 500 ఇండ్లను కేటాయించారు సికింద్రాబాద్ నియోజవర్గం వారికి 500 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను జవహర్ నగర్ లో కేటాయించడం జరిగినది వీరందరికీ అలాట్మెంట్ సర్టిఫికెట్లను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదిగా అందజేశారు లోకల్ గా ఉండే వారికి 10% రిజర్వేషన్ ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సహకారం చేయాలని మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని అన్ని వసతులతో కట్టించి పంపిణీ చేయడం జరుగుతుంది ఇలాంటి పథకాలు దేశంలో మరి ఎక్కడ చేపట్టలేదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ప్రస్తుతం రానివారు ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదన్నారు మళ్ళీ విడతలవారీగా అప్లై చేసుకున్న వాళ్లందరికీ అందుతాయని అలాగే మహిళల పేరుపైన సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద 3.లక్షలు అందజేసి గృహలక్ష్మి పథకం కింద అరులైన వారిని ఎంపిక చేసి వారికి కూడా సొంతింటిని నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా, జవహర్ నగర్ బి ఆర్ ఎస్ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, ఆర్డీవో రాజేష్ కుమార్, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
-----------------------
Admin