సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఖానాపురం సర్కార్ న్యూస్, డివిజన్ నర్సంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఖానాపురం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చూడి బాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి తక్కళ్ళపెల్లి రవీందర్ రావు విచ్చేసి చూడి బాల్ రెడ్డి పార్థీవ దేహాంపై పూలమాల వేసి నివాళీలు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులన పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాల్ రెడ్డి మృతి విచారకరమన్నారు. పార్టీకి ఎనలేని సేవలు అందించి న బాల్ రెడ్డి అందరిని అప్యాయతతో పలకిరిస్తూ అందరి మనస్సులో మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తి బాల్ రెడ్డి అని కొనియాడారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.
-----------------------
Reporter