సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పది రోజులు పాటు జరిగిన జాతీయస్థాయి థియేటర్ టెక్నికల్ వర్క్ షాప్ లో విన్నపం ఒక పోరాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు వర్క్ షాప్ లో పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ తెలుగు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగు మాత్రమే కాకుండా చాలామందికి తెలియని ఎన్నో రకాల సంస్కృతికి కోర్సులు ఉన్నాయాని పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీలో సీటు పొందవచ్చు అవి కూచిపూడి,జర్నలిజం,యూనివర్సిటీ బిల్డింగ్,ఆంధ్ర నాట్యం,తెలుగు కలల మ్యూజియం, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్,థియేటర్,సంగీతం,మిమిక్ర,జానపాదం లాంటి వివిధకోర్సులు ఉన్నాయి. హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉంది. వీటిని విద్యార్థులందరూ ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఉపయోగించుకోవాలి. అనవసరంగా బయట వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా పేద విద్యార్థులకు ఉపయోగించుకోవాలని విన్నపం ఒక పాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చీకూరి లీలావతి అన్నారు. ఈ వర్క్ షాప్ లో తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య బట్టు రమేష్, బరోడా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దర్శన్, సతీష్ చంద్ర పురోహిత, గౌరవ అతిధులుగా ఆచార్య డి ఎస్ ఎన్ మూర్తి, ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు, డా.ఎల్ వి భూషణ్, డా: రాజ్ ఆంటోని, డా : బీహెచ్ పద్మప్రియ, మల్లాది గోపాలకృష్ణ, బిహెచ్ కళ్యాణి ** తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin