సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పే అంతిమమని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమని, కార్యకర్తలు నాయకులు ఎవరు అదైర్య పడవద్దన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందెందుకు అధికార పక్షానికి ఎప్పుడు సహకరిస్తామన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయవచ్చునన్నారు. రెండుసార్లు తనను గెలిపించి షాద్ నగర్ అభివృద్ధికీ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా ఆదరించారని గుర్తు చేశారు. కార్యకర్తలు నాయకులు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, నవీన్ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్, దేవేందర్ యాదవ్, రామకృష్ణ, అడ్డు, లక్ష్మీనారాయణ గౌడ్, మురళిదర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
-----------------------
Admin