సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మేల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం జరిగాయి. స్ధానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్ డే వేడుకల్లో ఫరూక్ నగర్ జడ్పీటిసి పీ. వెంకట్రామిరెడ్డి, కొత్తూరు మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, రెడ్డి సేవా సమితి నాయకులు గుర్రం రవీందర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సీపీఐ నాయకుడు శ్రీను నాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు పెంటనోల్ల నర్సింహ మాదిగ, మాజీ జడ్పీటిసి నర్సింగ్ రావు తదితరులు హాజరై ప్రతాప్ రెడ్డినీ సన్మానించారు. కృష్ణ మహేశ్ ప్రజాసేన అద్యక్షుడు ఎండి ఖాదర్ గోరి ఆద్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా సహకారం అందిస్తున్న ప్రజలకు, స్నేహితులకు, రాజకీయ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. ఈ సంధర్భంగా ప్రతాప్ రెడ్డి అభిమానులు రక్తదానం చేశారు. ఖాదర్ గోరి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో యువసత్తా లక్ష్మణ్, జాంగారి రవి, రాయికల్ మోహన్ రెడ్డి, సర్పంచ్ సంపత్, కిషన్ నగర్ నేత శంకర్ రెడ్డి, కొత్తూరు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin