సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి* సందర్భంగా హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి మానవుడి శరీరం, మనస్సు , తెలివితేటలు , ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీన దయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు. వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ, స్వావలంబన కల ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారం అని భావించాడు. భారతదేశం ఒక స్వతంత్ర , స్వాలంబన దేశంగా ఉండాలని భావించేవారు . వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి పాశ్చాత్య భావనలపై భారత దేశం ఆధారపడ కూడదని పేర్కొన్నారు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ గంథం సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దేనుమకొండ రామరాజు, చింతలపూడి ఉమామహేశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin