సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : గత 18 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోథ్ దశరథ్ నాయక్ కోరారు.గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.ఇప్పటికే కేజీబీవి స్కూళ్లు మూతపడి విద్యార్ధులు అయోమయంలో వున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ తెలిపారు.దాంతో పాటు మండల రిసోర్స్ కార్యాలయంలో పనిచేసి ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు,సీఆర్పిలు సమ్మెలో వుండడంతో మధ్యాన్న భోజన ఏజెన్సీల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.ప్రభుత్వం చొరవ చూపి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలకు పిలవాలని కోరారు.ఉద్యోగుల రేగులరైజేషన్ చేయాలని,కనీస వేతనం అమలు పరచాలని,ఆరోగ్య భద్రత, ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.సమావేశంలో నాయకులు శ్రీను,రమేష్,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin