సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తల్లాడ మండలం, గత పది రోజుల నుంచి సాగర్ కాల్వలకు సాగర్ జలాలు లేక, తమ పంట పొలాల లో వేసిన వరి .మిర్చి పంటలు ఎండిపోతున్నాయని తెలంగాణ రైతు సంఘం తల్లాడ మండల కమిటీ , సాగర్ జలాలను విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని ఎన్. ఎస్. పి డి కు .వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు గుంటుపల్లి వెంకటయ్య మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం రైతుల పక్షపాతి రైతుబంధు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని రైతులకు నీళ్లు విడుదల చేసే ఇరిగేషన్ శాఖలో తగినంత సిబ్బందిని భర్తీ చేయకుండా నాగార్జునసాగర్ కాలువలో ఉన్న చెట్లను తొలగించకుండా పంటకు ముందే కాల్వలను మరమ్మతులు, చేయాల్సిన ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడంలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు.రైతు సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా ఉంటే రైతు పక్షపాతి ఎలా అవుతుందని ఒక్కసారి పంటలు నీటి ఎద్దడికి గురైతే లక్షల్లో రైతులకు నష్టాలు వస్తాయని వెంటనే ఇరిగేషన్ శాఖలో తగినంత సిబ్బందిని నియమించాలని సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందజేయాలని రైతు సంఘం తల్లాడ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు నల్లమోతు మోహన్ రావు మండల కమిటీ సభ్యులు అయినాల రామలింగేశ్వర రావు కందికొండ నర్సిరెడ్డి గుండ్ల వెంకటేశ్వర్లు పొన్నం కృష్ణయ్య జి .వెంకటేశ్వర్లు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఎన్ .ఎస్ పి .డి ఈ సిరిపురం మేజర్ కు బుధవారం సాగర్ జలాలు అందిస్తామని ఎన్.ఎస్పి.డిఈ హామీ ఇచ్చారు.
-----------------------
Admin