Monday, 27 July 2026 02:37:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా 45 వ మహాసభలను జయప్రదం చేయండి...

Date : 07 February 2025 01:40 AM Views : 870

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : 2025 ఫిబ్రవరి 17,18 తేదీల్లో నల్గొండలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా 45వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు గురువారం రోజున మహాసభల కరపత్రాలను మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది అన్నారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అనేకమైన విద్య రంగా సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం నాలుగు నెలలు అవుతున్న కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి విద్యశాఖ మంత్రిని కేటాయించలేదన్నారు. విద్యరంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అధికార యంత్రం కూడా విద్య రంగ సమస్యలను పరీస్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఈ మాహసభలో మేధావులతో విద్యార్థులతో చర్చించి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై సానుకూలంగా చర్చలు జరిపి భవిష్యత్తు కార్యక్రమాలకు సిద్ధం అవుతమన్నారు ఈ మాసభలకు విద్యార్థులు మేధావులు యువత భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్ సైదా నాయక్ ప్రసన్న వీరన్న సంపత్ మణి అనిల్ అఖిల్ బన్నీ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :