సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : 2025 ఫిబ్రవరి 17,18 తేదీల్లో నల్గొండలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా 45వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు గురువారం రోజున మహాసభల కరపత్రాలను మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది అన్నారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అనేకమైన విద్య రంగా సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం నాలుగు నెలలు అవుతున్న కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి విద్యశాఖ మంత్రిని కేటాయించలేదన్నారు. విద్యరంగ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అధికార యంత్రం కూడా విద్య రంగ సమస్యలను పరీస్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ఈ మాహసభలో మేధావులతో విద్యార్థులతో చర్చించి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై సానుకూలంగా చర్చలు జరిపి భవిష్యత్తు కార్యక్రమాలకు సిద్ధం అవుతమన్నారు ఈ మాసభలకు విద్యార్థులు మేధావులు యువత భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్ సైదా నాయక్ ప్రసన్న వీరన్న సంపత్ మణి అనిల్ అఖిల్ బన్నీ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin