Monday, 27 July 2026 07:32:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లారీ కింద పడి వ్యక్తి మృతి...

Date : 02 August 2023 02:10 AM Views : 284

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో దాబా వద్ద లారీ కింద గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు షాద్ నగర్ సిఐ ప్రతాప్ లింగం తెలిపారు. ఈనెల 30వ తేదీన ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో డిఎస్ చౌదరి మార్వాడి ధాబా వద్ద లారీ నెంబర్ ఎపి 37 టిఎఫ్ 3685 లారీ టైర్ల మధ్య తలకు బలమైన గాయాలతో రక్తస్రావంతో పోలీసులకు లభించాడని తెలిపారు. పెట్రోలింగ్ వాహన పోలీసులు మోహన్బ్ లాల్, గోవర్ధన్ గౌడ్ డ్యూటీలో ఉండగా లారీ సంఘటన కనిపించినట్టు రిపోర్ట్ చేశారు. అయితే 25 నుండి 30 సంవత్సరాల అందాజా వయస్సు కలిగిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియ రాలేదని పేర్కొన్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలుపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్టు సిఐ ప్రతాప్ లింగం మీడియాకు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :