సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం గిర్నిబావిలోని జి ఆర్ బి కన్వెన్షన్ హాలులో జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనన్న ఆదేశాల మేరకు మండల ఇంచార్జ్ కడారి సురేష్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ లు హాజరై నూతన జిల్లా యువజన మరియు దుగ్గొండి మండల కమిటీ, యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శిగా కానుగుల కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, దుగ్గొండి మండల అధ్యక్షునిగా పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షులుగా చొప్పరి భాస్కర్ ముదిరాజ్, కొత్తపల్లి శివ, కార్యదర్శిగా మోకిడే శ్రీకాంత్, దుగ్గొండి మండల యూత్ కమిటీ అధ్యక్షునిగా బోళ్ల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బండారి ఉదయ్ కుమార్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు డ్యాగం శివాజీ, మోకిడే దేవరాజు, ల్యాగల ప్రవీణ్ సింగరబోయిన నవీన్, ఇజ్జగిరి నరేష్, యార నర్సింహ, పెంతల రమేష్, పొన్నం రాజు లు పాల్గొన్నారు.
-----------------------
Reporter