Monday, 27 July 2026 05:05:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి... - సీపీఐ

Date : 19 July 2023 04:20 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు : ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి మీడియా ప్రతినిధులుకు 2018 సంక్రాంతి పండుగ రోజు నలశింగయ్యగారిపల్లిలో తన నివాసంలో విందు భోజనం ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరికీ 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండల కేంద్రoలో మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఇంటి స్థలాలు కోసం రెండవ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న జర్నలిస్టులకు సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూజర్నలిస్టులు సమాజానికి, రాజకీయ పార్టీలకు తమ విలువైన సమయాన్ని హెచ్చిస్తూ సేవలందిస్తూన్నరన్నారు. అలాంటి వారిని చులకన భావంతో చూడకుండా ప్రభుత్వం నుంచి అందే ఏకైక సంక్షేమ పథకం ఇంటి స్థలం మంజూరుకు ఎమ్మెల్యే, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులలో ముఖ్యుడు వి.కే. ఆదినారాయణరెడ్డి 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సిపిఐ నాయకులు నివాళులు అర్పించారు. జర్నలిస్టుల రిలే నిరాహారదీక్షను తెదేపా నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సాయిరాం ఆంజనేయులు దీక్షలో పాల్గొన్న మీడియా ప్రతినిధులకు పూలమాలలు వేసి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసే వరకు కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చలపతి, మహిళ సంఘం నాయకురాలు రత్నాభాయి,నాయకులు నాగేంద్ర, పుష్పాల రామాంజులు, అంజినప్ప, కే చలపతి, సత్యప్ప, సిద్దమ్మ,వసంతు, అంజినప్ప, సిద్దప్ప, గంగులమ్మ, ఆదేమ్మ, రత్నమ్మ, రవణమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :