సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండల కేంద్రంలో గురువారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా నందిపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. పద్మశాలి గౌరవ అధ్యక్షులు మన్పూర్ భూమేష్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా విడిచిపెట్టిన పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారు కొనియాడారు, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తన ఆస్తులను లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్ప త్యాగమూర్తిని వారు తెలిపారు. అదేవిధంగా పెద్దలు యువకులు కొండ లక్ష్మణ్ బాపూజీ ని ఆదర్శంగా తీసుకుని తన అడుగుజాడల్లో నడవాలి అంటూ వారు కోరారు, ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాన్పూర్ భూమేష్ టౌన్ సెక్రెటరీ రవి , బాల గంగాధర్ ,స్వర్గం నరసయ్య, బూస పోశెట్టి ,జిందం రాజేందర్, అరుట్ల రమేష్, దత్తు, డిసి గంగాధర్ ,జనార్ధన్, ధర్మపురి తాళ్ళ, మాజీ వార్డ్ మెంబర్ రాజు , ఐదో తర్ప పెద్దమనిషి తిరుమల జనార్ధన్..తదితరులు పద్మశాలి పెద్దలు పాల్గొన్నారు.
-----------------------
Admin