సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంఏర్పాటు చేశారు కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొని జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిపిసిసి సభ్యులు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె బి శౌరి గారు మాట్లాడుతూ ... దేశ స్వాతంత్రం తెచ్చిన గొప్ప చరిత్రగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్రము ఇచ్చినా పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజలకోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ స్థాపించి 137 సంవత్సరాలు పూర్తయి 138 సంవత్సరంలోకి అడుగిడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్టం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనో సంక్షేమ పథకాలను అమలు చేశారు అని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్ రెడ్డి గార్ల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు.వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో టిపిసిసి సభ్యులు ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె బి శౌరి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, ప్రకాశ్ రావు,వార్డు కౌన్సిలర్ తంగెళ్ళ లక్ష్మణ్,సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్ రావు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్ గరీభ్ పేట ఎంపిటిసి కసనబోయిన భద్రం, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాణోత్ కోటేష్ నాయక్,అల్లాడి నరసింహ రావు,ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు గౌస్,హరిసింగ్, పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు,గిరిప్రసాద్, సురేష్,సంగు యాలాద్రి, ఆదరి కొమరయ్య, షకీల్,బొమ్మన బోయిన సైదులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin