సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్, జూన్ 25, సర్కార్ టివి న్యూస్ ప్రతినిధి: ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారా కాలనీ నందు నిర్వహించిన బంజారా ప్రీమియర్ లీగ్ 2023 క్రికెట్ మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై క్రికెట్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శరీరక, మానసిక పునరుత్తేజానికి తోడ్పాటు ఇస్తుంది అని తెలిపారు. కేవలం క్రీడల్లో కాకుండా చదువుల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బారాస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, బంజారా కాలనీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, మాజీ అధ్యక్షుడు పంతు నాయక్, వార్డు సభ్యురాలు అంజమ్మ, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, మహిళలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin