Sunday, 26 July 2026 04:38:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మున్సిపల్ వార్డుల్లో సమస్యలు విలయతాండవం... -బీఎస్పీ కి ఒక్క అవకాశం ఇవ్వండి

Date : 26 June 2023 02:23 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లోని కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న 30వ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి బీఎస్పి కార్యక్రమంలో భాగంగా వార్డులో కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ అయిదు సంవత్సరాలకు ఒకసారి ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు వస్తున్నారు తప్ప గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. 30వ వార్డులో 10,15 రోజులకు ఒకసారి కిన్నెరసాని మంచినీరు వస్తుందని వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు.మార్చి నెల నుంచి వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ సమస్య యధావిధిగా ఉందని ఆరోపించారు.గతంలో కొత్తగూడెం పట్టణ ప్రజల సౌకర్యార్థం వార్డుల్లో సింగరేణి యాజమాన్యం వీధి కులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.అయితే కిన్నెరసాన్ని నీరు ఇంటింటికి సరఫరా చేస్తున్నామని డాంబికాలకు పోయి స్థానిక ఎమ్మెల్యే వనమా సింగరేణి వీధి కులాయిలను నిర్వీర్యం చేశారని,దీంతో ప్రజలకు కిన్నెరసాని నీరు,సింగరేణి సరఫరా చేసే మంచినీరు రెండు లభించక ఈ వేసవికాలం నానా అగచాట్లు పడ్డారని అన్నారు.సమస్యల పరిష్కారం దిశగా ప్రజలు అడుగులు వేయనంతవరకు నియోజకవర్గంలో చుట్టపు చూపుగా ఎమ్మెల్యేలు వచ్చిపోతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజా జీవితంలో ఉన్న స్థానికుడికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,అగ్రవర్ణ పేదల కోసం పనిచేసే బీఎస్పి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మూసధోరణిలో ఎన్నికల్లో ఓట్లు వేయడం వల్లనే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా,కొత్తగూడెం నియోజకవర్గంలో కనీసం అభివృద్ధి జరగకుండా పోతుందని అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించానని,కిన్నెరసాని మంచినీటి సరఫరా కోసం నూతన పైప్ లైన్ నిర్మాణమే శరణ్యమని అన్నారు.రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అల్లకొండ శరత్,శారదా,సుజాత,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :