సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి తదుపరి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణపై సమీక్ష సమావేశం ఉంటుందని అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
-----------------------
Admin