సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని ఆదర్శ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి నోటు పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ డి. రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు అందించడం పట్ల హర్ష వ్యక్తం చేశారు. పుస్తకాలు నాణ్యత కూడా చాలా బాగున్నాయని విద్యార్థులు ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైదులు గౌడ్, పిచ్చయ్య, విష్ణువర్ధన్, నాగరాజు, లక్ష్మణ్ రావు, వెంకట్, వాణి, భారతి, వసంత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin