సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు లో భారీ వర్షం, రైతుల్లో ఆనందం... మండల కేంద్రమైన వేంసూరు తో పాటు లింగపాలెం , ఎర్రగుంట. మర్లపాడు చుట్టుప్రక్కల గ్రామాలలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతన్నలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట ను రైతులు పండిస్తున్నారు. ఇప్పటికే చెరువులలో కుంటలలో, నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, పంట పొలాల్లో, ఆకాశవాయి, పంట పొలాల్లో కురిసిన వర్షపు నీరు పొట్ట దశకు చేరిన వారి పైరుకు జీవం పోసినట్లు అయిందని రైతులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలువ ద్వారా బేతుపల్లి వరద నీరు, నాగార్జునసాగర్ జలాలు, లంక సాగర్ జలాలు విడుదల కావడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేతపల్లి వరద నీటితో ఏంసూరు మండలంలోని 49 చెరువులు నిండాయి. అదేవిధంగా ఎర్ర స్వామి వారి బంజర, రాజు గూడెం, చౌడవరం, పల్లెవాడ, ముద్దుల గూడెం , అటసర్లపాడు, రామన్నపాలెం, సింహం గూడెం ,బీరపల్లి, పెనుబల్లి మండలం సుబ్బయ్య గూడెం, ఎన్టీఆర్ జిల్లా గణేష్ పాడు, తదితర గ్రామాలలో సాగర్ జలాలు అందుతుండటంతో రైతులు రెండు పాటలు పండిస్తున్నారు.
-----------------------
Admin