సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక రైతు సంక్షేమ పథకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం సాధించలేని అభివృద్ధిని తెలంగాణ సాధించిందని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బొత్తల పాలెం లో చేపట్టిన చెరువుల పండగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరెంటు, సాగునీరు, తాగునీరు, గ్రామాల సమగ్ర అభివృద్ధి జరిగిందన్నారు. 170 కోట్లతో ఈ ప్రాంతంలో లిఫ్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయకట్టు చివర ప్రాంతానికి ఇది వరంలా మారనుందన్నారు. ప్రతి ఇంటికి తమ ప్రభుత్వ సంక్షేమ పథకం అందిందని చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే, చెరువుగట్టులకు ఉన్న గ్రామదేవతలను ఘనంగా కొలిచే సాంప్రదాయాన్ని మారువబోమన్నారు. మరోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధి జరుగుద్దన్న విషయాన్ని మరువద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భోగాల వీరారెడ్డి, ఉప సర్పంచ్ వెంకటయ్య, ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందే లక్ష్మీనారాయణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అనంత ప్రకాష్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు. మహిళలు కోలాటం, బతుకమ్మలు పేర్చటం, బోనాలు ఎత్తడంతో పండగ వాతావరణం నెలకొంది.
-----------------------
Admin