సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం జయమంగలి నదిలో ఇసుకరీచ్ రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇసుక టిప్పర్ చక్రాలు వద్ద పడుకొని జయమంగలి నది బ్రిడ్జి పైన సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కనిశేట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సహకారంతో పరిగి మండలంలోని జయ మంగలి నదిలో ఇసుక రిచ్ ఏర్పాటు చేశారని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాల అడుగంటిపోయి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని, ప్రజా ప్రతినిధులు స్పందించకుండా అక్రమ ఇసుక వ్యాపారస్తులకు కొమ్ముకాస్తున్నారని పరిగి మండల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని భవిష్యత్తులో ఇసుకను ఈమండల ప్రజలకు లేకుండా చేయటానికి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సహకారం ఉన్నదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇస్మాయిల్, చలపతి, మారుతీ రెడ్డి, వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఫక్రుద్దీన్, లక్ష్మీనారాయణ, నరసింహులు, యేసయ్య, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin