సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం 11వ తారీఖు రోజున మధ్యాహ్నం 2:00 గంటలకు బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సూర్యాపేటకు విచ్చేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారని, ఎస్వీ కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్ షో నిర్వహించి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు.. కావున నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు పోలగాని ధనంజయ గౌడ్ ,మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆరూరి శివ, తోనకనూరి సంతోష్ కుమార్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకారపు పరిపూర్ణ చారి, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్, పట్టణ ఉపాధ్యక్షులు కందుల రమేష్, జిల్లా నాయకులు నూకల శైలేందర్ ,పంతంగి సాలయ్య తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin