సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి పంచాయితీ ఏగినాటి కోటయ్య కాలనీ ప్రజలు సుమారుగా రెండు నెలల నుంచి నీటి కోసం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తిరిగి ఈసారి అలసిపోయి చివరకు విసుగు వచ్చి పిల్లాపాపలతో గుక్కడి నీటి కోసం మాచర్ల బైపాస్ రోడ్డు మీద నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఆరోజు ఓట్ల కోసం గల్లి గల్లి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించుకున్నారు. మీ సమస్య ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని ఆనాడు వాగ్దానం చేసిన నాయకులు ఇప్పుడు మొఖం చాటేశారు నీళ్లు లేక రోజుల తరబడి అల్లాడిపోతుంటే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు కనుక మా సమస్యను రోడ్డుపైనే పరిష్కరించుకోవాలని ఈ నిరసన దీక్ష చేపట్టామని కాలనీ ప్రజలు అంటున్నారు. ఎర్రగొండపాలెం పోలీసు వారు నిరసన దీక్ష దగ్గరకు చేరి వారికి నీటి సమస్యను మేము పరిష్కరిస్తాము అని పంచాయతీ సెక్రెటరీ ఆర్డబ్ల్యుసి డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించిన కాలనీ ప్రజలు. ఏదేమైనా అధికారులు వెంటనే స్పందించి ఏగినాటి కోటయ్య కాలనీ ప్రజల నీటి సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
-----------------------
Admin