సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం. షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం నాట్కో పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ... మన తెలంగాణలో మన యువతకే ఉద్యోగాలు వస్తున్నాయని.. అందుకని విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వారి తల్లిదండ్రులు తోర్పాటు అందించాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
-----------------------
Admin