సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో డిజిటల్ బోధన చేస్తున్నందున ప్రజలందరూ విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వాటి బలోపేతానికి సహకరించాలని పాలకవీడు ఎంపిటిసి మీసాల ఉపేందర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు జరిగిన విద్యా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే అర్హత సాధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారని, వీరికి సిలబస్ ప్లానింగ్ కరికులం ప్లానింగ్ తో పాటు ప్రతి పిల్లవాడికి అర్థమయ్యేలా బోధించేటటువంటి ప్రావీణ్యతను కలిగి ఉంటారని కనుక ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్రను సృష్టిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల నుండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ప్రతిభ కనబరిచిన వారు బాసర ఐఐఐటి లో సీట్ పొంది ఆరు సంవత్సరాల తరువాత ఇంజనీరింగ్ పట్టభద్రులు గా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిపారు.అనంతరం బాలికలు కోలాట నృత్యం చేస్తూ ర్యాలీ నిర్వహించి, కళవేదిక పై చూడముచ్చటగా కోలాట నృత్యం చేశారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి,ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు ఉపేందర్, వెంకటరెడ్డి,సైదులు,స్వప్న,శ్రీనివాస్,రాములు,అనంతరెడ్డి, రామాంజనేయులు,సంధ్యరాణి, రేష్మా సిఆర్పి మంగ్తా నాయక్,తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin