సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా హై స్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదిగా పురవీధుల గుండ ర్యాలీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి ఆంజనేయులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా పురవీధుల గుండా వివిధ రంగాల కార్మికులు అంగన్వాడి, ఆశ ,మధ్యన భోజనము వర్కర్స్ voa గ్రామపంచాయతీ ,voa , ల కు కనీస వేతనం 26000 ఇవ్వాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని,పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తుంది అన్నారు మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుంది దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తుంది అన్నారు 44 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని అన్నారు....
-----------------------
Admin