సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ) : రామవరం మున్సిపాలిటీ ఏడు వార్డుల్లో గృహలక్ష్మి నిబంధనలు సడలించకపోతే మహిళలుగా ఉద్యమించక తప్పదని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పదో వార్డులో జరిగిన మహిలా సంఘాల సమావేశంలో మునిగడప పద్మ మాట్లాడుతూ గృహలక్ష్మి దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్ పట్టా కావాలని నిబంధన ఏడు వార్డుల ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే రామవరం ప్రాంతానికి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేసి గృహ నిర్మాణాలకు స్థలాలను ఇచ్చి, సొంత జాగల్లో గృహ నిర్మాణాలు చేసుకునేందుకు ఎలాగా పథకాన్ని అమలుపరిచా రో అలాగే ఇప్పుడు కూడా ఉన్నతాధికారులు దీనిపై ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నత అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు .లేకుంటే వచ్చే ఎన్నికల్లో రామవరం మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు మంగమ్మ, మార్తమ్మ ,జానకి, కవిత డి సీత ,అను, సుప్రియ, బేబీ, రాజేశ్వరి, మహేశ్వరి, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin