సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పోలీసు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి శాంతి స్తూపం వద్ద అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం, పోలీసు ఫ్లాగ్ డే వేడుకలను ఉద్దేశించి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ముత్తయ్య మాట్లాడుతూ... శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని త్యాగానికి సేవకు ప్రతీక పోలీసులని అన్నారు. ఈ ర్యాలీలో పోలీసులు, పలు పార్టీల రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు....
-----------------------
Admin