సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం శివాజీ నగర్ గ్రామంలో ఓకే ట్రాన్స్ఫార్మర్ కి చాలామంది రైతులు కరెంటు వినియోగం చేయడం వల్ల తరచూ మోటర్లు కాలిపోతుండడంతో ఈ విషయాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి విషయంలో ఎమ్మెల్యే వెంటనే స్పందించడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ సర్పంచ్ సుకినే నాగరాజు,బిక్కాజి పల్లి సర్పంచ్ రమేష్,ఉపసర్పంచ్ రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సుకినే శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు బుసారి హరీష్, వార్డు మెంబర్ వాణి, రాజేశ్వరరావు రజిత, మరియు రవి, రామారావు, రాజు, తిరుమల రావు, శీను రాజేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter