సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలైన BC, SC, ST, & EBC ప్రజలకు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు సాధనకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ లకు మరియు మండల కేంద్రాల్లోని MRO లకు వినతిపత్రాలు అందించిన పిదప ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేనందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 8 రోజులుగా ధర్మ సమాజ పార్టీగా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం,, ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు,: ధర్మ సమాజ్ పార్టీ ప్రధానమైన డిమాండ్లు,,,1, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి మరియు ప్రతి గ్రామంలో అత్యాధునికమైన స్కూల్ మరియు కాలేజ్ ని నిర్మించాలి 2, ప్రజలందరికీ ఉచిత న్యాయమైన వైద్యాన్ని అందించాలి ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పటల్ని నిర్మించాలి 3 ప్రజలందరికీ చేసుకోవడానికి వారి అర్హతను బట్టి ఉపాధిని అందించే చేతినిండా గౌరవ ప్రధానమైన పనిని కల్పించాలి 4 అర్హులైన వారి అందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలి అర్హులైన వారి అందరికీ 200 గజాల స్థలంతో నాలుగు గదుల ఇల్లుని నిర్మించి ఇవ్వాలి అని ధర్మ సమాజ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ భోలేశ్వర్ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ జిల్లా నాయకులు రాజీవ్ గంగరాజు గోపాల్రాజు పరుశరాములు శేఖర్ కవీన్ లింగం శివరామకృష్ణ రాజు లింగం తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin