సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొందుర్గు మండల్ : గ్రామాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని బైరంపల్లి, లాలాపేట్, చెరుకుపల్లి, విశ్వనాథ్ పూర్, లక్ష్మీదేవి పల్లి, అయోధ్యపుర్ తండాలలో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఉత్తరాసపల్లి గ్రామంలో అంతర్గత మురుగుకాలువ నిర్మాణపనులకు భూమి పూజ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామాల రూపురేఖలను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కిందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలని కోరారు....
-----------------------
Admin