సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని రెవిన్యూ ఇన్స్పెక్టర్ సుర్జిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.తదనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వస్కుల రామయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో, ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర, జర్నలిస్టుల సేవలు మరువలేనిదని పేర్కొన్నారు.ఎంతో కాలం నుంచి వృత్తి మీద ఇష్టంతో భాగంగా, ఎంతోమంది సామాజిక సేవలో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారదిగా,నిస్వార్థంతో నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు రవీందర్ నాయక్,పాండు నాయక్ బేత శివారెడ్డి,పల్లె సుధాకర్ శంకర్ నాయక్, చిలక సైదులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin