Monday, 27 July 2026 12:37:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాలకులు బ్రష్టు పట్టిస్తున్నారు... -ఏ. ఐ. ఎస్. ఎఫ్

Date : 27 February 2023 12:38 AM Views : 703

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాలకులు నీరు కారుస్తున్నారని తమ విధానాలతో బ్రష్టు పట్టిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, లక్ష్మణ్ లు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయికరణ చేయాలని ప్రయత్నిస్తున్నదని, పసిమెదళ్లలోకి మతాన్ని చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు. ఖమ్మం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నాడు జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. తొమ్మిదేళ్ల తెలంగాణ పాలనలో విద్యకు కేటాయించాల్సిన బడ్జెట్ను కేటాయించలేదని కేటాయించింది కూడా ఖర్చు చేయలేదన్నారు. విద్యార్థి వీరుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ సిద్ధించిన సిఎం కేసిఆర్ ఎప్పుడు వారి గురించి ఆలోచించలేదని మణికంఠ, లక్ష్మణ్ లు ఆరోపించారు. ఆంధ్రాకు చెందిన కార్పొరేట్ కళాశాలలను తరిమికొడతామని చెప్పిన సిఎం కేసిఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలుకుతున్నారని ఎన్నికల సందర్భంగా జూనియర్ కళాశాలల్లో మిడ్డేమిల్స్ సహా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ విద్య క్రమేపి దూరమవుతుందని విద్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందు దొందేనన్నారు. ఒకరు కార్పొరేట్లకు కొమ్ముకాస్తుంటే మరొకరు మతాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యార్థులు వినియోగించే వస్తువులపై జిఎస్టి విధించటం విద్యా వ్యతిరేకతను తెలియజేస్తుందన్నారు. మార్చి నాలుగు, ఐదు తేదీలలో ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడుపల్లి లక్ష్మణ్, ఇటికాల రామకృష్ణ, యువరాజ్, నాగులమీరా, సతీష్, ఉజ్వల్, చందులాల్, కాశి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :