సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రభుత్వం వెంటనే సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని బిఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేశగాని సాంబశివ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలక వీడు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి పొలాలను పరిశీలించి రైతులతోమాట్లాడారు.అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతేరాజు అని అంటున్న ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువకు నీరు ఎందుకు విడుదల చేయట్లేదో, హుజూర్ నగర్ నియోజకవర్గం లో ఉన్న పేద రైతులు ఎడమ కాలువ నీటి విడుదల చేస్తే తప్ప సాగు చేయలేరని ప్రత్యేకముగా జాన్ పహాడ్ మేజర్ కింద వేల ఎకరాలు ఇప్పటివరకు దుక్కి దున్నలేదని రైతులు తీవ్ర ఆవేదనతో తమతో వేడుకున్నారని తక్షణమే నీటి విడుదల చేసి సన్నకారు రైతులు పంట సాగు చేసేల చూడాలని ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ నేత్రుత్వంలో రాష్ట్రంలో, హుజూర్ నగర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యము రాబోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లగాని సుబ్బుగౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు మందరవి,జిల్లా మహిళాకన్వీనర్ వెంపటి నాగమణితదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin