సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తొమ్మిదేండ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజలకు వివరించి బీజేపీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ రూపొందించుకుందనీ షాద్ నగర్ బిజెపి నేతలు అన్నారు. బిజెపి కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బిజెపి నేత ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9 ఏళ్ల పాలనలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమ కోసం మోడీ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ జరిగిందని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మూడు కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించామని పేర్కొన్నారు. 11.8 కోట్ల గృహాలకు మరియు 100% గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. 48.3 కోట్ల జన్ధన్ ఖాతాలను తెరిపించి బ్యాంకింగ్ వ్యవస్థలో పేదలను అనుసంధానం చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాసంస్థలలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేశామని ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా 34 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు. ఫసల్ బీమా యోజన ద్వారా 37.5 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారని చెప్పారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నాలుగు కోట్ల రైతులకు లక్షల కోట్ల క్రెడిట్ ఇచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రిషికేష్, నర్సింలు, మురళి, సాయిబాబా, నవీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin