Sunday, 26 July 2026 06:17:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మ దహనం

Date : 25 November 2025 06:12 PM Views : 206

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జెఏసి వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం కార్యక్రమంలో బీసీ జెఏసి వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేయకుండా సర్పంచ్ ల ఎన్నికలకు వెళ్లడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బిసి జెఏసి కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మల దహనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే ఏ ఎన్నికల నైనా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. జిఓ 46 తో బీసీ లను రాజకీయ సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జిఓ నెంబర్ 9 విడుదల చేసిన ప్రభుత్వంమే ఇప్పుడు జీవో నెంబర్ 46 ను విడుదల చేసి బీసీలకు ద్రోహం చేసిందని జీవో నెంబర్ 46 ను రద్దు చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం పై బీసీల పోరాటం ఆగదని బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 46 ను తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు చీకటి ఒప్పందం తోనే ఆగ మేఘాలతో జీవో నెంబర్ 46 తీసుకొచ్చిందని తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం రెడ్లను సర్పంచులుగా చేయడానికి అగ్రకుల నాయకులు బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసే సందర్భంలో రెండు పార్టీలు ఇప్పుడు మాట మార్చి బీసీలకు ద్రోహాన్ని తలపెడుతున్నాయని సర్పంచులను సైతం రాష్ట్రంలో అగ్రకులాలకే కట్ట పెట్టాలనే కుట్రతోనే 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న బీసీలకు పోరాటాలు లేని కొత్త కాదని సాధించేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను రద్దుచేసి రేపు జరగబోయే పార్లమెంటు శీతాకాల సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పోరాడాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భాగంగా బీసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారని అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ పవర్ రాష్ట్ర అధ్యక్షులు ఆబోతు రాజు యాదవ్, బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్, బిసి జేఏసీ వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు విద్యాసాగర్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, నర్సంపేట మండల నాయకులు మారపాక రమేష్ ముదిరాజ్, దుగ్గొండి మండల నాయకులు దండు రాంబాబు ముదిరాజ్, కొలిపాక సుధాకర్, గౌరవ అధ్యక్షులు రామగిరి యాదగిరి స్వామి, బీసీ పవర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మచ్చిక రాజు గౌడ్, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ మండల కన్వీనర్ సంఘాల శివ, బీసీ పవర్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సంగినేని లకన్ ముదిరాజ్, జిల్లా కోఆర్డినేటర్ సునీల్, బీసీ నాయకులు శీరంశెట్టి రాజేందర్ పెరక, మద్దెల కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: