సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో గత నెల పొలం పనులకు వెళ్తుండగా జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన షేక్ నాగుల్ మీరా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం హుజూర్ నగర్ బైతుల్ మాల్ కమిటీ సభ్యులు ఉస్మానియా మస్జీద్ నందు 15,000 రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బైతుల్ మాల్ కమిటీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోరుకోవాలని అల్లాను వేడుకున్నారు. ప్రతీ ముస్లీం కుటుంబం విధిగా తమ వంతు ఫిత్ర, జకాత్ లను బైతుల్ మాల్ కమిటీకి అందించి నిరుపేద ముస్లింలకు ఆర్ధిక సాయం చేసి వారి సంక్షేమానికి పాటు పడాలని కోరారు. నిరుపేదలకు మీరు సాయం చేస్తే అల్లా దయ మీకు ఎల్లపుడు తోడుగా ఉంటుందని ముస్లీం సోదరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బైతుల్ మాల్ కమిటీ సభ్యులు స్థానిక ముస్లీం సోదరులు పాల్గొన్నారు
-----------------------
Admin