సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : శుక్రువారం రోజున పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరెడ్డి, తాత మధుసుధన్, జడ్పీచైర్ పర్సన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటిస్తారని కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10: 00 గంటలకు కూసుమంచి మండలం ఈశ్వరమాధారం గ్రామంలో బీటీ రోడ్డు మరియు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 10: 25 నిమిషాలకు కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11: 20 నిమిషాలకు ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12: 00 గంటలకు ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటలో భహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు పాల్గొనగలరని పాలేరు శాసనసభ్యుల వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు...
-----------------------
Admin